ముంబయిలో అగ్నిప్రమాదం: 12మంది మృతి
ముంబయి : ముంబయిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 12మంది దుర్మరణం చెందారు. కైరానీ రోడ్డులో ఓ దుకాణంలో సోమవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 12 చనిపోయినట్లు తెలుస్తోంది. ముందుగా మంటలు కింద అంతస్తులో చెలరేగి, అనంతరం దట్టమైన పొగలు అలుముకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా మంటల్లో చిక్కుకున్నవారిని ఆస్పత్రికి తరలించగా, వారంతా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. పొగకు ఊపిరి ఆడక వారంతా మృతి చెందినట్లు తెలిపారు. ఈ సంఘటనపై సీనియర్ సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ 25 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు చెప్పారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
మరిన్ని వార్తలు