కూతుళ్లను చంపి తల్లి ఆత్మహత్య 

Daughters Killed By Own Mother In Sircilla - Sakshi

ఇద్దరు కూతుళ్లకు ఉరేసి.. తాను ఉరేసుకున్న మమత 

బోయినపల్లి (చొప్పదండి): ఓ తల్లి తన ఇద్దరు కూతుళ్లకు ఉరేసి, తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. బోయిన్‌ పల్లికి చెందిన సంబ చిలుకవ్వ–నర్సయ్యల కూతురు మమతకు అదే గ్రామానికి చెందిన పెద్ది మల్లయ్య కుమారుడు శ్రీనివాస్‌తో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి స్వీకృతి(5), రిషిత (3) సంతానం.  మమతను అదే గ్రామానికి చెందిన మహేశ్‌ అనే యువకుడు లైంగికంగా వేధిస్తుండటంతో పెద్ద మనుషుల దృష్టికి తీసుకువెళ్లారు. అయినా వేధింపులు ఆగలేదు. ఈ క్రమంలో ఆదివారం మమత ఇంట్లో గడియ పెట్టి తన ఇద్దరు కూతుళ్లకు  ఉరేసి, అనంతరం తను ఉరేసుకుని మృతి చెందింది. చేను వద్దకు వెళ్లిన భర్త శ్రీనివాస్, మామ మల్లయ్య సాయంత్రం ఇంటికి వచ్చి చూసే మమత, స్వీకృతి, రిషితలు విగతజీవుల్లాగా పడి ఉన్నారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top