60 తులాల బంగారం, 2కేజీల వెండి స్వాధీనం: అంజనీ కుమార్‌

CP Anjani Kumar Said 3 Members Of Parthi Gang Arrested - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గత నెల 26న తార్నాకలో నివాసం ఉండే సతీష్‌ రెడ్డి ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు చేధించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన పార్థి గ్యాంగ్‌ ఈ నేరానికి పాల్పడినట్లు సీపీ అంజనీ కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆరుగురు వ్యక్తులు దొంగతనానికి పాల్పడగా వారిలో మనీషా డిస్కో, అలీ రాజా ఖాన్, రూపా బాయ్‌లను అరెస్ట్‌​చేశామన్నారు. అంతేకాక వారి వద్ద నుంచి 22 లక్షల రూపాయల విలువ చేసే 60 తులాల బంగారం, 2 కిలోగ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నమన్నారు. ఈ గ్యాంగ్‌ రెండు తెలుగు రాష్ట్రాల్లో 2004 నుంచి దొంగతనాలకు పాల్పడుతుందని తెలిపారు.

ఈ గ్యాంగ్‌ మధ్యప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు అంజనీ కుమార్‌ పేర్కొన్నారు. మొదటిసారి మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు MP09CK2347 కార్లో వచ్చి దొంగతనం చేసి పారిపోయారన్నారు. ఆ తరువాత వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారని.. హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్, రేణిగుంట పోలీస్ స్టేషన్లలో ఈ గ్యాంగ్‌పై దాదాపు 12 కేసులు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకూ ఈ గ్యాంగ్‌లో 99శాతం మందికి ఉద్యోగం, ఉపాధి లాంటివి కల్పించామని.. మిగిలిన కొద్ది మంది ఇంకా ఇలా దొంగతనాలకు పాల్పడుతున్నారని అంజనీ కుమార్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top