దంపతుల ఆత్మహత్య

couple suicide with poison - Sakshi

పెంచికలపాడులో విషాదం

పెంచికలపాడు (గూడూరు రూరల్‌):  కె.నాగలాపురం పోలీసు స్టేషన్‌ పరిధిలోని పెంచికలపాడు గ్రామంలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్‌ఐ మల్లికార్జున వివరాల మేరకు.. దేవనకొండ మండలం కరివేముల గ్రామానికి చెందిన గిడ్డమ్మ(35)కు 15 ఏళ్ల క్రితం పెంచికలపాడుకు చెందిన స్వాములు(42)తో వివాహమైంది. వీరికి కుమారుడు మనోజ్‌ (8వ తరగతి), కుమార్తె స్వాతి (4వ తరగతి) ఉన్నారు. శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది.

దీంతో మనస్తాపం చెందిన గిడ్డమ్మ పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా కోలుకోలేక అర్ధరాత్రి ఆమె మృతి చెందింది. తన కుమార్తె మృతికి అల్లుడు స్వాములు వేధింపులే కారణమని మృతురాలి తల్లి చంద్రమ్మ ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా గిడ్డమ్మ మృతి చెందినప్పుటి నుంచి పరారీలో ఉన్న స్వాములు ఆదివారం సాయంత్రం నందికొట్కూరు సమీపంలో ఓ గోదాం వద్ద పురుగుల మందు తాగి చనిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. క్షణికావేశంలో తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడటంతో పిల్లలు అనాథలయ్యారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top