దంపతుల ఆత్మహత్య

Couple Commits Suicide in Tamil nadu - Sakshi

తమిళనాడు, అన్నానగర్‌: లాల్‌క్కుడిలో దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. తిరుచ్చి జిల్లా లాల్‌కుడి నాగమయార్‌ వీధికి చెందిన అరుణ్‌ ప్రభు ఓ ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థలో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. లాల్‌కుడి కాట్టూర్‌ ప్రాంతానికి చెందిన ప్రియాను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి రెజీనా అనే కుమార్తె ఉంది. కుటుంబ సమస్య కారణంగా కొన్నేళ్ల క్రితం ప్రియా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనంతరం అరుణ్‌ ప్రభు సెంబరై ప్రాంతానికి చెందిన బంధువు ప్రతిభను 9 నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. లాల్‌కుడి భారతినగర్‌ ప్రాంతంలో నివసిస్తున్నారు. ప్రతిభ నాలుగు నెలల గర్భిణీ. భార్యాభర్తల మధ్య తరచూ తగాదాలు వచ్చేవి. ఆదివారం మరోసారి గొడవ పడ్డారు. మనస్థాపం చెందిన ప్రతిభ ఆదివారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పనికి వెళ్లి ఇంటికి వచ్చిన అరుణ్‌ ప్రభు భార్య ఉరికి వేలాడడం చూసి దిగ్భ్రాంతి చెందాడు. లాల్‌కుడి పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి ప్రతిభ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం లాల్‌కుడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇద్దరు భార్యలు ఆత్మహత్య చేసుకోవడం వల్ల మనస్థాపంతో ఉన్న అరుణ్‌ ప్రభు సోమవారం ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. లాల్‌కుడి సమీపంలోని ఓ చెట్టుకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top