పరీక్షల్లో ఫెయిల్‌ చేస్తానంటూ..

Class 9 Student Commits Suicide In Noida - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు భరించలేక తొమ్మిదో తరగతి చదివే ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. నోయిడాలో జరిగిన ఈ దారుణ ఘటనలో ఇద్దరు టీచర్లు, స్కూలు ప్రిన్సిపాల్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నోయిడాలోని సెక్టార్‌ 52లో నివసించే బాధిత విద్యార్థిని అద్భుతమైన డ్యాన్సర్‌ అని చెబుతున్నారు. అందరి ప్రశంసలు పొందే విద్యార్థినిపై ఇద్దరు ఉపాధ్యాయుల కన్ను పడింది.

వారిలో ఓ టీచర్‌ ఆమెను లైంగికంగా వేధింపులకు గురిచేస్తూ తాను చెప్పినట్టు వినకుంటే పరీక్షల్లో ఫెయిల్‌ చేయిస్తానని బెదిరించినట్టు బాలిక తల్లితండ్రులు తెలిపారు. ఈనెల 16న ప్రకటించిన పరీక్షా ఫలితాల్లో బాధిత బాలిక రెండు సబ్జెక్ట్‌లలో ఫెయిల్‌ అవడంతో మనస్ధాపానికి గురై తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించిన నోయిడా పోలీసులు ఆమె తల్లితండ్రుల ఫిర్యాదుపై విచారణను చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top