షాకింగ్ : రైల్వే ప్లాట్ఫాంపై ఉన్న పార్శిల్ తెరచి చూడగా
వెయ్యి కిలోల కుక్క మాంసం పట్టివేత
సాక్షి, చెన్నై : తమిళనాడులోని ఎగ్మూర్ రైల్వేస్టేషన్లో లభించిన ఓ పార్సిల్ను తెరచి చూసిన పోలీసులకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఐదో నంబర్ ప్లాట్ఫాంపై అనుమానాస్పద పార్సిల్ ఉందన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు.. వెయ్యి కిలోల కుక్క మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.
వివరాలు...రాజస్తాన్ నుంచి చైన్నై బయల్దేరిన జోధ్పూర్ ఎక్స్ప్రెస్లో కుక్క మాంసాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారని చెన్నై పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో శనివారం ఉదయం ఫుడ్ సెక్యూరిటీ అఫీషియల్స్తో సహా వారు ఎగ్మూర్ స్టేషన్కు చేరుకున్నారు. అక్కడ ఉన్న పార్సిల్ను తెరచి చూడగా అందులో జంతువు మాంసం ఉన్నట్లు కనుగొన్నారు. అయితే అది కుక్క మాంసంగా భావించిన ఫుడ్ సెక్యూరిటీ అధికారులు పరీక్షల నిమిత్తం దానిని ల్యాబ్కు తీసుకువెళ్లారు.