ప్రమాదానికి కారణమైన కారు
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): సత్యం జంక్షన్లో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మరణానికి కారణమైన కారు యజమానిని మూడో పట్టణ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున మద్దిలపాలెం నుంచి గురుద్వారా వైపు వెళ్లే మార్గంలో ఎస్.అప్పలనాయుడు (50)ని సత్యం జంక్షన్లో కారు ఢీకొనడంతో ఘటనా స్థలిలోనే చనిపోయిన విషయం తెలిసిందే. అనంతరం డ్రైవర్ కారుతో సహా పరారయ్యాడు. అయితే ఈ కారు ముందుగా ఆటోను ఢీకొట్టడంతో అది తునాతునకలయింది. అందులోని ప్రయాణికురాలు అందించిన వివరాల ప్రకారం... కారు కాకినాడకు చెందిన తిరుమలరావుదిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మూడో పట్టణ సీఐ ఇమ్మానియేల్రాజు పర్యవేక్షణలో ఎస్ఐ సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.