ఆస్తి తగాదాల్లో అన్నను చంపిన తమ్ముడు

Brother who killed elder brother - Sakshi

 టేకుల్‌కోడ్‌ గ్రామంలో ఘటన

కర్ణాటక పోలీసుల సహాయంతో వెలుగులోకి

కొడంగల్‌ రూరల్‌ : కుటుంబ తగాదాలు, ఆస్తి గొడవలతో తోడబుట్టిన అన్నను తమ్ముడు హత్య చేసిన సంఘటన మండల పరిధిలోని టేకుల్‌కోడ్‌ గ్రామంలోచోటుచేసుకొంది. సీఐ శంకర్‌ తెలిపిన వివరాలు.. టేకుల్‌కోడ్‌ గ్రామానికి చెందిన నరేందర్‌రెడ్డి(30), రాజేందర్‌రెడ్డి(రాజేశ్వర్‌రెడ్డి)లు అన్న దమ్ములు. గత నెల 28వ తేదీన నరేందర్‌రెడ్డి తన తల్లి పద్మమ్మను కొట్టిన విషయం తమ్ముడు రాజేందర్‌రెడ్డి తెలుసుకొని హైదరాబాద్‌ నుంచి టేకుల్‌కోడ్‌కు వచ్చాడు.

ఈ నెల 9వ తేదీన నరేందర్‌రెడ్డిని తమ్ముడు రాజేందర్‌రెడ్డి, మరో స్నేహితుడు లక్ష్మీసాగర్‌(లక్ష్మణ్‌) సహాయంతో ఫోన్‌లో మాట్లాడిటేకుల్‌కోడ్‌ గ్రామ స్టేజీ దగ్గరకు మాట్లాడుకుందామని పిలిపించారు. మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో గ్రామ స్టేజ్‌ సమీపంలో ఉన్న గుంతలోకి తీసుకెళ్లి నరేందర్‌రెడ్డిని కత్తితో పొడిచి హత్య చేశాడు. హత్య చేసిన విçషయం తెలియకుండా ఉండేందుకు ఓ కారు డిక్కీలో వేసుకొని మృతదేహాన్ని కర్ణాటకలోని గుర్మిట్‌కల్‌ సమీపంలో ఉన్న బోడబండతండా సమీపంలోకి తీ సుకెళ్లారు.

 ఈక్రమంలో కొనుగోలు చేసిన పెట్రోల్‌తో ఓ గుంతలో శవాన్ని వేసి నిప్పు పెట్టారు. క ర్ణాటకలో ఎన్నికల సమయం కావడం తో స్థానిక రెవెన్యూ, పో లీస్‌ సిబ్బంది, వైద్యుల సహాయంతో ఆదివారం సంఘటనా స్థలంలోనే మృతదేహానికి పంచనామా నిర్వహించారు. మృతుడికి భార్యలక్ష్మీ, తల్లి పద్మమ్మ ఉన్నారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శంకర్‌ తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top