ప్రాణం తీసిన బైక్‌ గొడవ

Brother Fight For Bike And Suicide in Hyderabad - Sakshi

అన్నదమ్ముల మధ్య ఘర్షణ అన్న ఆత్మహత్య

లంగర్‌హౌజ్‌: బైక్‌ విషయంలో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ ఓ యువకుడి బలవర్మణానికి దారి తీసిన సంఘటన లంగర్‌హౌజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీను కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. లంగర్‌హౌజ్, బాపూనగర్‌కు చెందిన శివాజీకి నలుగురు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు రాజు(21), కాగా చివరి వాడు ఆకాష్‌. ఈ నెల 2వ తేదీ రాత్రి బైక్‌ విషయమై వారి మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో మనస్తాపానికి లోనైన రాజు ఈ నెల 3న తన ఇంట్లో హిట్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నార

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top