నవ వధువు అనుమానాస్పద మృతి

Bride Suspicious death In Karnataka - Sakshi

కృష్ణరాజపురం: వివాహమైన మూడు వారాలకే యువతి అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన సోమవారం కే.ఆర్‌.పురం రైల్వేస్టేషన్‌ పరిధిలోని రైల్వే వసతి సముదాయంలో చోటు చేసుకుంది. రైల్వేశాఖలో ఉద్యోగం చేస్తున్న నరేశ్‌ అదే ప్రాంతానికి చెందిన రమితా (21)లు చిన్నప్పటి స్నేహితులు. ఈ క్రమంలో ఒకే కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఇద్దరి స్నేహం ప్రేమగా మారడంతో ఇదే సంవత్సరం మార్చిలో కుటుంబ సభ్యుల ఆమోదంతో రమితా, నరేశ్‌ల వివాహం జరిగింది.

అయితే ఇటీవల నరేశ్‌ తల్లి మృతి చెందడంతో ఆమె దుస్తులు ఖాళీ చేసే విషయమై ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీనిపై కొద్ది రోజులుగా ఇరువురి మధ్య గొడవలు కూడా జరుగుతున్న నేపథ్యంలో సోమవారం రమితా విగతజీవిగా కనిపించారు. ఇది ముమ్మాటికి హత్యేనని నరేశ్‌ మరో యువతిని వివాహం చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నాడని అందుకు రమితా అడ్డుగా ఉందని భావించిన నరేశ్‌ తన చిన్నమ్మ, చిన్నాన్నలతో కలసి రమితాను హత్య చేసాడంటూ రమితా తల్లితండ్రులు ఆరోపించారు. కే.ఆర్‌.పురం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top