బాలుడి అనుమానాస్పద మృతి

Boy Suspicious death In Hyderabad - Sakshi

తల్లిపైనే అనుమానం

పోలీసులకు తండ్రి ఫిర్యాదు  

చంచల్‌గూడ: భార్యభర్తల మధ్య గొడవ ఓ బాలుడి ప్రాణం తీసిన సంఘటన  ఆదివారం అర్థరాత్రి మాదన్నపేట పోలీసు స్టేషన్‌ పరిధిలోని చోటు చేసుకుంది. ఎస్‌ఐ నాగేష్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రెయిన్‌బజార్‌కు చెందిన ముక్రం, నుసరత్‌ దంపతులకు నలుగురు సంతానం. మరదలితో ముక్రం  వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో గత కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో వారి కుమారుడు రిహాన్‌ (3) అనుమానాస్పద స్థితిలో సంపులో పడి మృతి చెందాడు. తన భార్య సునరత్‌ రేహాన్‌ హత్య చేసిందని ముక్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రమాదవశాత్తు అతను సంపులో పడి మృతి చెందాడని సునరత్‌ చెబుతోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top