ఘోర ప్రమాదం: బైక్తో సహా కాలిబూడిదైన యువకుడు
బెంగళూరు : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి తిరుపతి వస్తున్న వ్యక్తి నడిరోడ్డుపై సజీవదహనం అయ్యాడు. ప్రమాదం జరిగిన తీరు స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. యమహా బైక్పై వేగంగా దూసుకువస్తున్న 21 ఏళ్ల నీరజ్.. కోలార్ జిల్లా, బంగారుపేట ప్రాంతంలో ఓ ప్రైవేట్ బస్సును ఢీ కొట్టాడు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఉవ్వెత్తున ఎగబాకడంతో ఎటూ కదలలేని పరిస్థితిలో నీరజ్ రోడ్డుపైనే సజీవదహనమయ్యాడు. బస్సును ఢీ కొన్న వెంటనే మంటలు చెలరేగి యువకుడిని చుట్టుముట్టాయని... రక్షించేందుకు అవకాశమే దొరకలేదని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.