రాంగ్‌రూట్‌లో ఎందుకు వచ్చారన్నందుకు..

Auto Driver Murdered in Karnataka - Sakshi

 ఆటోడ్రైవర్‌ హత్య  

తుమకూరులో ఇద్దరు యువకుల కిరాతకం

తుమకూరు : రాంగ్‌రూట్‌లో రావడాన్ని ప్రశ్నించినందుకు ఇద్దరు యువకులు ఆటోడ్రైవర్‌ను కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన గురువారం తుమకూరు నగరంలోని బనశంకరి లేఔలో చోటు చేసుకుంది. ఆటో నడుపుతున్న అస్గర్‌ (30) గురువారం బనశంకరి లేఔట్‌ మీదుగా వెళుతుండగా అదే మార్గంలో ఎదురుగా ఇర్ఫాన్, ఫయాజ్‌ అనే ఇద్దరు యువకులు బైక్‌పై ఎదురుగా వచ్చారు. రాంగ్‌రూట్‌లో రావడాన్ని ప్రశ్నించినందుకు ఇద్దరు యువకులు ఆటోడ్రైవర్‌పై కత్తితో దాడి చేశారు. గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స ఫలించక మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న జయనగర పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు. అస్గర్‌ హత్యతో ఆయన కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top