షాపింగ్మాల్లో వీరంగం
ఇద్దరు యువకులు అరెస్టు
టీ.నగర్: చెన్నై మౌంట్ రోడ్డులోని ఒక షాపింగ్మాల్లో పాతకక్షల కారణంగా మాల్ సిబ్బందిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న ప్రజలను, కత్తి చూపి బెదిరించిన ఇద్దరు యువకులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. చెన్నై మౌంట్ రోడ్డులో షాపింగ్ మాల్లో కళ్లద్దాలు, కళ్లజోళ్లు, షూ, సెల్ఫోన్ దుకాణాలు వందకు పైగా ఉ న్నాయి. ఈ షాపింగ్ మాల్లోని రెండో అంతస్థులో గల అద్దాల షాపులో వ్యాసార్పాడి కల్యాణపురానికి చెందిన కేశవన్ (22). అలాగే థౌజండ్ లైట్స్ అలగిరి నగర్కు చెందిన ఆంథోని (19) సమీపంలోగల షూ దుకాణంలో రెండు నెలలుగా పని చేసి, నిలిచిపోయాడు. ఇరువురి మధ్య ఇది వరకే పాత కక్షలు ఉన్నట్లు సమాచారం.
ఇలా ఉండగా ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో షాపింగ్ మాల్కు వచ్చిన ఆంథోని కేశవన్తో వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో కేశవన్ అతనిపై దాడి చేశాడు. అక్కడి నుంచి వెళ్లిపోయిన ఆంథోని సోమవారం నటరాజన్ (20)తో అక్కడికి వచ్చి కేశవన్పై దాడి చేశాడు. ఆ సమయంలో పక్కన ఉన్న దుకాణారులు, ప్రజలు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా కత్తి చూపించి బెదిరించి పారిపోయాడు. దీని గురించి స్థానికులు పోలీసులకు సమాచారం తెలపడంతో థౌజండ్ లైట్స్ పోలీసులు విచారణ జరిపి ఆంథోని, నటరాజన్లను సోమవారం అరెస్టు చేశారు.