ఖమ్మంలో పూజారిపై దాడి
సాక్షి, ఖమ్మం : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పిండిప్రోలు మండలంలోని ఓ ఆలయ పుజారి కుటుంబంపై దుండగులు అర్థరాత్రి దాడి చేశారు. సోమవారం ఓ వెంచర్లో అక్రమ బ్లాస్టింగ్ను సదరు పూజారి కుటుంబం అడ్డుకుంది. ఈ విషయంలో పూజారి కుటుంబానికి, వెంచర్ నిర్వాహకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో అర్థరాత్రి కార్లో పూజారి ఇంటికి వచ్చిన దుండగులు వీరంగం సృష్టించారు. పూజారి, ఆయన కుటుంబసభ్యులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారుని స్వాధీనం చేసుకున్నారు.
సంబంధిత వార్తలు