కేబుల్ ఆపరేటర్ హత్య కేసులో నిందితుల అరెస్ట్
భీమారం : భీమరంలోని చింతగట్టు క్యాంపునకు చెందిన కేబుల్ ఆపరేటర్ హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు కేయూ ఇన్స్పెక్టర్ సతీష్బాబు తెలిపారు. కేయూ పోలీస్ స్టేషన్లో సోమవారం నిందితులను ప్రవేశపెట్టి, కేసు వివరాలను వెల్లడించారు. చింతగట్టు క్యాంపునకు చెందిన కేబుల్ ఆపరేటర్ నీరుకుల్ల శ్రీనివాస్కు.. ఆరునెలల క్రితం అదే ప్రాంతానికి చెందిన అరికంటి నిఖిల్ మధ్య గొడవ జరిగింది.
దీంతో శ్రీనివాస్ను ఎలాగైనా అంతమొందించాలని నిఖిల్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఎర్రగట్టుగుట్ట ప్రాంతానికి చెందిన తన స్నేహితుడు నల్లికుదిటి సతీష్, కంబాల శ్రీనివాస్లతో కలిసి హత్య పథకం రచించారు. ఈనెల 3న రాత్రి నిఖిల్, సతీష్, శ్రీనివాస్లు మద్యం సేవించి చింతగట్టు క్యాంపు వద్ద కేబుల్ ఆపరేటర్ శ్రీనివాస్ను హత్యచేయడానికి మాటు వేశారు.
వ్యక్తిగత పనుల నిమిత్తం బయటికి వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా ముగ్గురూ కలిసి నీరుకుల్ల శ్రీనివాస్పై కర్రలతో దాడి చేశారు. స్థానికులు గమనించి శ్రీనివాస్ను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈనెల 14న శ్రీనివాస్ మృతి చెందాడు. సోమవారం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు పంపినట్లు ఇన్స్పెక్టర్ చెప్పారు. ఈ సమావేశంలో ఎస్సై భీమేష్, సిబ్బంది పాల్గొన్నారు.