కామాంధుడ్ని చితకబాదిన గ్రామస్తులు..

Accused Died in People Attack in Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: మద్యం మత్తులో ఓ కామాంధుడు అభం శుభం తెలియని ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన జిల్లాలోని నందిపేట్‌ మండలం డొంకేశ్వర్‌లో చోటుచేసుకుంది. వివరాలివి.. సాయన్న అనే వ్యక్తి బాలికకు చాక్లెట్‌ ఇస్తానని ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. గ్రామస్తులు కోపంతో ఆ కామాంధుడ్ని చెట్టుకు కట్టేసి చితకబాదారు. 

ఆ నిందితుడ్ని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో సాయన్న మార్గ మధ్యలోనే మృతి చెందాడు. మైనర్‌ బాలిక ప్రభుత్వ ఆస్పత్రితో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top