నేడు శ్రీవారి సేవ ‘రథసప్తమి’ స్లాట్
సాక్షి, తిరుమల: రథసప్తమినాడు తిరుమలకు వచ్చే భక్తులకు సేవలందించేందుకు శ్రీవారి సేవ ‘‘ప్రత్యేక సందర్భాల’’ స్లాట్ను మంగళవారం టీటీడీ విడుదల చేయనుంది. వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయాల్లో ‘‘ప్రత్యేక సందర్భాల’ స్లాట్ను ఆన్లైన్లో బుక్ చేసుకుని భక్తులకు సేవలందించవచ్చు. మంగళవారం సాయంత్రం 7 గంటలకు ఆన్లైన్లో స్లాట్ను అందుబాటులో ఉంచుతారు.
ఆసక్తి గలవారు తమ ఆధార్ కార్డు ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఈ స్లాట్ పొందిన భక్తులు ఈ నెల 22న తిరుమలలోని శ్రీవారి సేవాసదన్లో రిపోర్టు చేయాలి. "www.tirumala.org'లో ‘శ్రీవారి సేవ సర్వీసెస్’అనే లింక్ క్లిక్ చేసి ‘శ్రీవారి సేవ’, ‘స్పెషల్ సేవ’అనే ఆప్షన్ల ద్వారా ఈ స్లాట్ను బుక్ చేసుకోవచ్చు.