ఉత్సాహం ఉరకలేసింది
తిరుపతి మంగళం: అభిమాన నేతను చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దారిపొడవునా క్యూ కడుతున్నారు. ఆదివారం చెర్లోపల్లె వద్ద పొలాల గట్లపై నుంచి జనం పరుగులు తీయడం కన్పిం చింది. జగన్నినాదాలతో జననేతను చూసి మురిసిపోయారు.
మహాశివరాత్రిని తెచ్చిన సంకల్పం
శ్రీకాళహస్తి జనసంద్రమైంది. అభిమానులతో మహా శివరాత్రిని తలపించింది. ప్రజా సంకల్ప యాత్రకు అడుగడుగునా అపూర్వ ఆదరణ లభించింది. యువకులు నృత్యాలు చేస్తూ, డప్పులు వాయిస్తూ అభిమాన నేతకు ఆత్మీయంగా స్వాగతం పలికారు.
బోటు విహారం
ప్రజా సంకల్పయాత్రకు అనూహ్య స్పందన లభిస్తోంది. అడుగడుగునా అభిమానులు పోటెత్తుతున్నారు. వినూత్న రీతుల్లో స్వాగతాలు పలుకుతూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. శ్రీకాళహస్తి మండలం ల్యాంకో సమీపంలోని చెరువులో ఆదివారం వైఎస్ఆర్సీపీ జెండాలతో పలువురు కార్యకర్తలు బోటు విహారం చేస్తూ జననేతకు స్వాగతం పలకడం కన్పించింది.