పద్మావతి అమ్మవారికి నాగపడగ
తిరుపతి రూరల్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ చేపట్టిన ప్రజాసంకల్పపాదయాత్ర చిత్తూరు జిల్లాలో జయప్రదంగా పూర్తయినందున ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి తిరుచానూరు పద్మావతి అమ్మవారికి రూ.7లక్షల విలువైన బంగారు నాగపడగను, పట్టువస్త్రాలను సమర్పించారు. సోమవారం అమ్మవారికి పూజలు చేసిన అనంతరం ఆలయాధికారులకు వాటిని అందజేశారు.