శ్రీవారి సన్నిధిలో ముఖ్యమంత్రి కుటుంబం

సాక్షి, తిరుమల: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం ఉదయం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. మంత్రి నారా లోకేష్‌, హిందూపురం శాసనసభ్యుడు, సినీ నటుడు బాలకృష్ణ కుటుంబసభ్యులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.

శనివారం సాయంత్రం నారావారిపల్లెకు వచ్చిన ముఖ్యమంత్రి కుటుంబసభ్యులు రాత్రి అక్కడే బసచేశారు. ఆదివారం ఉదయం భోగి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం తిరుమల చేరుకుని వెంకన్నను దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపం వద్ద వేదపండితులు ఆశీర్వచనాలు పలికారు. ఈ సందర్భంగా శ్రీవారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు.

Read latest Chittoor News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top