షావోమి ‘ఎంఐ ఏ3’@ 12,999
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘షావోమి’ తాజాగా ఆండ్రాయిడ్ వన్ ఆధారంగా పనిచేసే ‘ఎంఐ ఏ3’ స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదలచేసింది. దీని ప్రారంభ ధర రూ. 12,999 వద్ద నిర్ణయించినట్లు కంపెనీ బుధవారం ప్రకటించింది. 6.08 అంగుళాల డిస్ప్లే, వెనుకవైపు ట్రిపుల్ కెమెరా (48మెగాపిక్సెల్, 8ఎంపీ, 2ఎంపీ), ముందువైపు 32 ఎంపీ కెమెరా, 4,030 ఎంఏహెచ్ బ్యాటరీ ఈఫోన్ స్పెసిఫికేషన్లుగా వెల్లడించింది.
సంబంధిత వార్తలు