జీఎస్టీ సందేహాలకు 'స్పెషల్ వార్ రూమ్'

జీఎస్టీ సందేహాలకు 'స్పెషల్ వార్ రూమ్'

న్యూఢిల్లీ : ఇంకో మూడు రోజుల్లో అతిపెద్ద పన్ను సంస్కరణ జీఎస్టీ భారత్ లో అమలుకాబోతుంది. జూలై 1 నుంచి అమల్లోకి రాబోతున్న ఈ పన్ను విధానంపై సందేహాలు రావడం సహజమే. ఈ సందేహాలను నివృతి చేయడం కోసం ప్రభుత్వం కూడా సిద్ధమైంది. జీఎస్టీ సందేహాలను వెనువెంటనే పరిష్కరించడానికి ప్రభుత్వం 'స్పెషల్ వార్ రూమ్' ను ఏర్పాటుచేసింది. '' స్పెషల్ వార్ రూమ్ ఏర్పాటుచేస్తున్నాం, ఒకవేళ జీఎస్టీ అమల్లో ఎలాంటి సందేహాలైనా వస్తే ఇది పరిష్కరిస్తుంది'' అని ఓ సీనియర్ ప్రభుత్వాధికారి చెప్పారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఇది ఆపరేట్ అవుతుందని తెలిపారు. ఒకేసారి వందలాది ఫోన్లు, కంప్యూటర్ సిస్టమ్స్ తట్టుకునే విధంగా ఈ వార్‌రూమ్‌ను డిజైన్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

 

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు లేవనెత్తిన పలు ప్రశ్నలకు ఈ వార్ రూమ్ సమాధానం ఇవ్వనున్నది. జీఎస్టీని ఎలాంటి అవకతవకలు లేకుండా అమల్లోకి తీసుకురావడానికి అన్ని ప్రక్రియలను పాటిస్తున్నామని సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అధికారులు కూడా పేర్కొన్నారు. జీఎస్టీ ఫీడ్ బ్యాక్, యాక్షన్ రూమ్ ను  ఈ సీబీఈసీనే ఏర్పాటుచేసింది. అన్ని మంత్రిత్వ శాఖలు, అధికార విభాగాలకు జీఎస్టీ మానిటరింగ్ సెల్స్ ను ఏర్పాటుచేశారు. వీటిని వారు పర్యవేక్షిస్తుంటారు. మానిటరింగ్స్ సెల్స్ తో వార్ రూమ్ కోఆర్డినేట్ అయి ఉంటుంది. నేటి నుంచే ఎగుమతిదారులు, దిగుమతిదారులు దీని టెస్ట్ ఫైలింగ్ ను చేపట్టవచ్చు. 
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top