వొడాఫోన్ మొబైల్ ఇంటర్నెట్ రేట్లు రెట్టింపు
న్యూఢిల్లీ: వొడాఫోన్ ఇండియా మొబైల్ ఇంటర్నెట్ రేట్లను రెట్టింపు చేసింది. 2జీ, 3జీ వినియోగదారులకు ఈ పెంపు వర్తిస్తుందని, దశలవారీగా దీనిని వివిధ టెలికం సర్కిళ్లలో అమలు చేస్తామని వొడాఫోన్ పేర్కొంది. పోస్ట్ పెయిడ్, ప్రి-పెయిడ్ వినియోగదారులకు పే-యాజ్-యూ-గో (పీఏవైజీ) విధానంలో 10 కేబీకి 4 పైసలు చార్జ్ చేస్తామని వివరించింది. గతంలో ఇది 10 కేబీకి 2 పైసలుగా ఉండేదని పేర్కొంది.
ధరను పెంచినప్పటికీ, పరిశ్రమలో ఇదే అత్యంత తక్కువ టారిఫ్ అని పేర్కొంది. తమ వినియోగదారుల డేటా వినియోగం గత ఆర్థిక సంవత్సరంలో 125 శాతం వృద్ధిని సాధించిందని వివరించింది. వొడాఫోన్ ఇండియాకు మొత్తం 5.2 కోట్ల మంది డేటా వినియోగదారులున్నారు. వీరిలో 70 లక్షల మంది 3జీ వినియోగదారులు.
సంబంధిత వార్తలు