భారత్‌ వచ్చేందుకు మాల్యా సంసిద్ధత?

Vijay Mallya in talks to return to India voluntarily - Sakshi

న్యూఢిల్లీ: రుణాల ఎగవేత ఆరోపణలతో విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా .. విచారణను ఎదుర్కొనేందుకు భారత్‌కు తిరిగి రావాలని భావిస్తున్నారు. తన సంసిద్ధతకు సంబంధించి విచారణాధికారులకు సంకేతాలు పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

పలాయనంలో ఉన్న ఎగవేతదారులకు దేశంలో, విదేశాల్లో ఉండే ఆస్తులను చట్టపరంగా జప్తు చేసుకునేందుకు వీలుగా కేంద్రం ఇటీవలే ఆర్డినెన్స్‌ను జారీ చేసిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. మూతబడిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కి సంబంధించి సుమారు రూ. 9,000 కోట్ల బ్యాంకు కుంభకోణం కేసులో మాల్యా సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ల విచారణను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం బ్రిటన్‌లో ఆయన ఉంటున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top