రేపు సాక్షి మైత్రి ఇన్వెస్టర్ల క్లబ్ సదస్సు
హైదరాబాద్: స్టాక్ మార్కెట్ పెట్టుబడి అవకాశాలు, మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడులు తదితర అంశాలపై సాక్షి మైత్రి ఇన్వెస్టర్ల క్లబ్ రేపు (శనివారం) ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సీడీఎస్ఎల్, కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థల సహకారంతో ఈ సదస్సును కొత్తపేటలోని సురభి ఇలైట్లో నిర్వహిస్తున్నారు. సాయంత్రం ఐదు గంటలకు మొదలయ్యే ఈ కార్యక్రమం రాత్రి 8 గంటల వరకూ కొనసాగుతుంది. ఈ సదస్సుకు హాజరు కావాలనుకునేవాళ్లు 9505555020 నంబర్కు ఫోన్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవాలి.
సదస్సులో సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్(ఇండియా) రీజనల్ మేనేజర్ శివ ప్రసాద్ వెనిశెట్టి, కార్వీ స్టాక్ బ్రోకింగ్ జోనల్ బ్రోకింగ్ హెడ్ ఎస్.వెంకట శ్రీనివాస రెడ్డి, కార్వీ స్టాక్ బ్రోకింగ్ టెక్నికల్ రీసెర్చ్ హెడ్ జంబు కుమార్ జైన్ ఇన్వెస్టర్లకు తగు సలహాలిస్తారు.
మరిన్ని వార్తలు