200పాయింట్లు పడిన మార్కెట్లు
సాక్షి,ముంబై: దేశీయస్టాక్మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల బలహీన సంకేతాల నేపథ్యంలో ట్రేడింగ్ ఆరంభంలోనే మార్కెట్లు నెగిటివ్గా మారాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 211 పాయింట్లు క్షీణించి 32,962 వద్ద, నిఫ్టీ 65పాయింట్ల నష్టంతో 10,118 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాలూ నష్టపోగా.. మెటల్, పీఎస్యూ బ్యాంక్స్ బాగా నష్టపోతున్నాయి. ఐటీ స్వల్ప లాభాల్లో ఉంది.సుందరం ఫైనాన్స్, మారికో, కాంకర్, టెక్ మహీంద్రా,డాబర్, ఇండియా బుల్స్, లాభపడుతుండగా టాటా స్టీల్ , హెచ్పీసీఎల్, హిందాల్కో, వేదాంతా,అ దానీ పోర్ట్స్, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫ్రాటెల్, బాష్, యస్బ్యాంక్, ఎన్టీపీసీ, ఆర్కాం, ఎయిర్టెల్ బజాజ్ హోల్డింగ్స్, ఐడియా, నష్టపోతున్నాయి.
మరోవైపు డాలర్ మారకంలో రూపీ 0.02 పైసల లాభంతో 64.95వద్ద కొనసాగుతోంది. అటు ఎంసీఎక్స్ మార్కెట్లో పుత్తడి నష్టాలనుంచి తేరుకుని 14రూపాయల మేర లాభపడి 10 గ్రా. 30,713వద్ద ఉంది.