టాప్-100 గ్లోబల్ టెక్ కంపెనీల్లో మనవి కూడా
టాప్-100 ప్రపంచ టెక్ కంపెనీల్లో దేశీయ టెక్ కంపెనీలు కూడా చోటు దక్కించుకున్నాయి. థామ్సన్ రాయిటర్స్ నేడు(బుధవారం) విడుదల చేసిన ప్రపంచపు టాప్-100 టెక్నాలజీ కంపెనీల ర్యాంకింగ్స్లో దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్, టెక్ మహింద్రాలు కూడా నిలిచినట్టు తెలిసింది. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ తొలి స్థానాన్ని దక్కించుకుంది. అనంతరం చిప్ తయారీదారి ఇంటెల్ కార్పొరేషన్, నెట్వర్క్ గేర్మేకర్ సిస్కో సిస్టమ్స్ ఇంక్లున్నట్టు వెల్లడైంది.
ఆల్ఫాబెట్, అమెజాన్, ఆపిల్, ఇంటెల్, సిస్కో, ఐబీఎం, ఎస్ఏపీ, అసెంచర్ కంపెనీలు టాప్-10లో ఉన్నాయి. మిగతా 90 కంపెనీలకు ర్యాంక్లను కేటాయించలేదు. ఈ జాబితాలోని 45 శాతం కంపెనీల ప్రధాన కార్యాలయాలు అమెరికాలోనే ఉన్నట్టు థామ్సన్ రాయిటర్స్ తెలిపింది. అమెరికా తర్వాత జపాన్, తైవాన్ దేశాల్లో ఉన్నట్టు పేర్కొంది. టాప్-100 గ్లోబల్ టెక్నాలజీ లీడర్స్ టెక్నాలజీ భవిష్యత్ను ప్రోత్సహించడానికి భరోసానిస్తున్నాయని థామ్సన్ రాయిటర్స్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ బ్రయాన్ స్కాన్లాన్ అన్నారు. ఈ ర్యాంకింగ్స్ను ఎనిమిది బెంచ్మార్క్స్లో 28 అంశాల ఆధారితంగా కేటాయించారు.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు