నెక్సాన్‌ ఎలక్ర్టిక్‌ ఈవీ లాంఛ్‌

Tata Nexon electric vehicle unveiled in India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎప్పటినుంచో వేచిచూస్తున్న నెక్సాన్‌ ఎలక్ర్టిక్‌ వాహనాన్ని టాటా మోటార్స్‌ గురువారం ఆవిష్కరించింది. నూతన జిప్ర్టాన్‌ పవర్‌ట్రైన్‌ టెక్నాలజీతో కూడిన నెక్సాన్‌ ఈవీ లిక్విడ్‌-కూల్డ్‌ మ్యాగ్నెట్‌ ఏసీ మోటార్‌తో అందుబాటులోకి వచ్చింది. ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మేషన్‌తో మోటార్‌ను అభివృద్ధి చేశారు. ఈ వాహనం కేవలం 4.6 సెకన్లలోనే సున్నా నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. డీసీ ఫాస్ట్‌ చార్జర్‌తో కస్టమర్లు నెక్సాన్‌ ఈవీని గంటలోనే 80 శాతం వరకూ చార్జింగ్‌ చేసుకోవచ్చు. నెక్సాన్‌ ఈవీ ఎక్స్‌ఎం, ఎక్స్‌జడ్‌ ప్లస్‌, ఎక్స్‌జడ్‌ప్లస్‌, లక్స్‌ వేరియెంట్స్‌తో లభిస్తుంది. ఈ వెహికల్‌కు డిసెంబర్‌ 20 నుంచి బుకింగ్స్‌ ప్రారంభమవుతాయి. 2020లో నెక్సాన్‌ ఈవీ సేల్స్‌ ప్రారంభమవుతాయి. ఈ వెహికల్‌ ధర రూ 15 లక్షల నుంచి రూ 17 లక్షల వరకూ ఉంటుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top