టేస్టీ బైట్ టేస్టీ డీల్!
అమెరికా మాతృ సంస్థ ప్రిఫర్డ్ బ్రాండ్స్ ఇంటర్నేషనల్ను కొనుగోలు చేసేందుకు ఒక ఒప్పందం కుదుర్చుకుందున్న వార్తలో టేస్టీ బైట్ ఈటబుల్స్ కౌంటర్ భారీ లాభాలను ఆర్జించింది. మార్స్ ఫుడ్ తో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడికావడంతో టేస్టీ బైట్ ఈటబుల్స్ కౌంటర్ జోరందుకుంది. ఎన్ఎస్ఈలో ఈ షేరు 8 శాతం జంప్చేసి ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.
దేశీయంగా టేస్టీ బైట్ బ్రాండుతో విభిన్న సాస్లు, ఫ్రోజెన్ ఫుడ్స్ను విక్రయిస్తున్న ఏషియన్ ఫుడ్ ప్రొడక్ట్స్ను మార్స్ ఫుడ్ సొంతం చేసుకోనుంది. ఇందుకు వీలుగా ప్రిఫర్డ్ బ్రాండ్స్ ఇంటర్నేషనల్ను చేజిక్కించుకోనుంది. స్వాధీనం తరువాత కూడా టేస్టీ బైట్ బ్రాండ్తో నే కొనసాగనుంది. పుణే కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ పోర్ట్ ఫోలియోలో ఇండియన్, ఆసియా స్పైస్ భోజన సామగ్రిని అందిస్తుంది. అలాగే సేంద్రీయ బియ్యం కాయధాన్యాలు సహా అనేక రకాల శాఖాహార ఉత్పత్తులను కస్టమర్లకు సరఫరా చేస్తుంది. ప్రధానంగా తన ఉత్పత్తులను అత్యధికంగా అమెరికాకు ఎగుమతి చేస్తుంది. మార్స్ ప్రపంచంలో అతిపెద్ద ఆహార సంస్థలలో ఒకటిగా మార్కెట్ లీడర్గా నిలిచింది. అయితే తమ కార్పొరేట్ స్థిరత్వం కోసం గుర్తింపు పొందిన సంస్థతో ఒప్పందం తరువాతి స్థాయికి తీసుకువెళ్లడానికి బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నామని అని బ్రూడ్స్ బ్రాండ్స్ సీఈవో అశోక్ వాసుదేవన్ తెలిపారు. మార్స్ ఫ్యామిలీలో చేరినందుకు సంతోషంగా ఉందన్నారు.