స్తబ్దుగానే కొనసాగుతున్న మార్కెట్లు
సాక్షి,ముంబై: ట్రేడింగ్ ప్రారంభం నుంచీ కన్సాలిడేషన్ బాట పట్టిన మార్కెట్లు అదే బాటలఓ కొనసాగుతున్నాయి. స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కదులుతున్న సెన్సెక్స్ ప్రస్తుతం 1పాయింట్ లాభంతో 33,598వద్ద నిఫ్టీ 2 పాయింట్ల నష్టంతో 10,22 వద్ద కొనసాగుతోంది. ఫార్మా, పీఎస్యూ బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ, రియల్టీ లాభాల్లో ఉండగా, మెటల్, ఐటీ రంగాలు నష్టపోతున్నాయి.
ముఖ్యంగా శోభా డెవలపర్స్ టాప్ విన్నర్గా ఉంది. చాలా కాలం తరువాత ఫార్మకుచెందినలుపిన్ పాజిటివ్గా ట్రేడ్ అవుతోంది. ఇంకా బీపీసీఎల్, టైటన్, హెచ్పీసీఎల్, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ఐవోసీ, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్లాభపడుతున్నాయి. మరోవైపు భారతీ, వేదాంతా, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్, విప్రో, యూపీఎల్, హెచ్సీఎల్ టెక్, ఎంఅండ్ఎం, బజాజ్ ఆటో, ఎల్అండ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
మరిన్ని వార్తలు