పటిష్టంగా స్టాక్మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్120 పాయింట్ల లాభంతో 33, 271వద్ద, నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 10,424 వద్ద చాలా బలంగా ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 10, 400 స్థాయికి పైనస్థిరంగా ట్రేడ్ అవుతుండటం విశేషం. ఐటీ తప్ప దాదాపు అన్ని సెక్టార్లు లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి.
వేదాంతా, టాటా మోటార్స్, ఆర్ఈసీ, పీటీసీ, జీఎస్ఎఫ్సీ, యూపీఎల్ లాభాల్లో ట్రేడ్ అవుతుండగా అదానీ, భారతి ఎయిర్టెల్ , ఐడియా ఇన్ఫీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
మరోవైపు దేశీ కరెన్సీ రుపాయి 13 పైసలు నష్టపోగా, పుత్తడి ధరలు మాత్రం బాగా పుంజుకున్నాయి.