సెన్సెక్స్‌ లాభాల సెంచరీ

stockmarkets  starts with gains - Sakshi

సాక్షి,ముంబై: దేశీయ మార్కెట్లు  లాభాలతో ప్రారంభమయ్యాయి. వరుస నష్టాలకుచెక్‌ చెప్పిన కీలక సూచీలు ఇన్వెస్టర్ల  కొనుగోళ్లతో  లాభాల బాట పట్టాయి.  దాదాపుఅన్ని సెక్టార్లులాభాలనార్జిస్తున్నాయి. క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లోని షేర్లకు ఎక్కువగా కొనుగోళ్ల ధోరణి కనిపిస్తోంది. హెల్త్‌కేర్, బ్యాంకింగ్, మెటల్స్ షేర్లు  కూడా లాభాల్లో  కొనసాగుతున్నాయి.దీంతో సెన్సెక్స్‌   సెంచరీ లాభాలను సాధించి  135 పాయింట్లు ఎగిసి 32, 895 వద్ద  ఉండగా నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో 10,160 వద్ద ఉంది. 

భారతీ ఇన్‌ఫ్రాటెల్, అంబుజా సిమెంట్స్, అరబిందో ఫార్మా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా మెటార్స్‌ లాభాల్లో ఉన్నాయి. అంబుజా,  ఇండియా సిమెంట్‌ తదితర షేర్లు లాభపడుతున్నాయి.  హీరో మోటోకార్ప్, హిందుస్తాన్ యూనిలీవర్, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అటు అడాగ్‌ గ్రూపు షేర్ల నష్టాలు కొనసాగుతున్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top