స్టాక్మార్కెట్ లాభాల ప్రారంభం: లాభాల్లో పీఎన్బీ
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 140పాయింట్ల లాభంతో 33,843 వద్ద, నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో 10399 వద్ద కొనసాగుతున్నాయి. ఆరంభంలో నిఫ్టీ 10400 స్థాయిని తాకినా వెంటేనే దిగువకు జారుకుంది. అయితే దాదాపు అన్ని సెక్టార్లు పాజిటివ్గానే ఉన్నాయి. ముఖ్యంగా భారీ అమ్మకాల నుంచి పీఎస్యూ బ్యాంకింగ్ సెక్టార్ కొద్దిగా కోలుకుంటోంది. పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ లాభపడుతున్నాయి. ఐటీ షేర్లలో టెక్ మహీంద్ర, టీసీఎస్ ఎన్ఐటీ లాభాల్లో కొనసాగుతున్నాయి. వీటితోపాటు ఏరోస్ ఇంటర్నేషనల్ బాగా పెరిగింది. అయితే ఫార్మ షేర్లు బయోకాన్, ఫోర్టిస్, కోల్ ఇండియా నష్టపోతున్నాయి.
మరిన్ని వార్తలు