లాభాల్లో స్టాక్మార్కెట్లు
సాక్షి, ముంబై: స్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో దేశీయ సూచీలు లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. డింగ్ ఆరంభంలోనే సెంచరీ లాభాలను సాధించిన సెన్సెక్స్ 122 పాయింట్లు ఎగిసి 33,600 వద్ద, నిప్టీ 34పాయింట్లులాభపడి 10,360వద్ద కొనసాగుతున్నాయి. ఫార్మా మినహా అన్ని రంగాలూ లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా రియల్టీ, మెటల్, ఆటో లాభపడుతోంది.
రిలయన్స్ కమ్యూనికేషన్స్, జీ ఎంటర్టైన్మెంట్, అదానీ పోర్ట్స్, ఏసీసీ లాభపడుతుండగా డా. రెడ్డీస్, టెక్ మహీంద్ర, యాక్సిస్ బ్యాంక్, హెచ్పీసీఎల్ నష్టపోతున్నాయి. మరోవైపు ఎఫ్ఎంసీజీ కంపెనీలు వివిధ ఉత్పత్తుల రేట్లు కోత నేపథ్యంలో నష్టాలను ఎదుర్కొంటున్నాయి.
సంబంధిత వార్తలు