నష్టాల్లోకి జారుకున్న స్టాక్మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు వరుస నష్టాలకు చెక్ చెప్పేందుకు ప్రయత్నించినా వైఫల్యం చెందాయి. సెన్సెక్స్ 33 పాయింట్లు ఎగిసి 38058 వద్ద , నిప్టీ 11 పాయింట్లు లాభపడి 11357 వద్ద ట్రేడ్ అయ్యాయి. కానీ అమ్మకాలు వెల్లువెత్తడంతో వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. సన్సెక్స్ 60 పాయింట్లు, నిఫ్టీ 14 పాయింట్లు బలహీన పడ్డాయి. దాదాపు అన్ని సెక్టార్లు నష్టపోతున్నాయి. ప్రధానంగా నిఫ్టీ బ్యాంకు బాగా నష్టపోతోంది.
యస్బ్యాంకు, హెచ్డీఎఫ్సీ భారీగా నష్టపోతోంది. అశోక్ లేలాండ్, అపోలోటైర్స్ 52 వారాల కనిష్టం వద్ద కొనసాగుతున్నాయి. టాటామోటార్స్, వేదాంతా, అదానీ పవర్, పీఎన్బీ నష్టపోతున్నాయి. ఎస్బీఐ, టీవీఎస్ మోటార్, కోటక్ మహీంద్ర బ్యాంకు స్వల్పంగా లాభ పడుతున్నాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయి బలహీనంగా ఉంది. మంగళవారం 9పైసలు నష్టంతో 69 వద్ద ట్రేడింగ్ను ఆరంభించింది. సోమవారం 68.91 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.
మరిన్ని వార్తలు