తెప్పరిల్లుతున్న స్టాక్‌మార్కెట్లు

Stockmarkets Opens With Possitive Note - Sakshi

సాక్షి,ముంబై:   దేశీయ స్టాక్‌మార్కెట్లు  భారీ నష్టాలనుంచి  ఫ్లాట్‌గా ప్రారంభమైనాయి.  అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో మరింత తెప్పరిల్లిన సెన్సెక్స్‌  65 పాయింట్లు ఎగిసి 35571 వద్ద, నిఫ్టీ 15పాయింట్ల  లాభంతో 10659వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని సెక్టార్లు లాభపడుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగం బాగా లాభ పడుతుండగా, ఫార్మ, ఐటి నష్టపోతోంది. వాటాదారులు 10శాతం వాటా అమ్మకం వార్తాలో ఇమామి 7శాతానికిపైగా ఎగిసింది. అలాగే టైటన్‌ యస్‌బ్యాంకు, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, వేదాంతా, టాటా మెటార్స్‌, ఐటీసీ టాప్‌ విన్నర్స్‌గా ఉండగా, ఇండియాబుల్స్‌, ఇన్ఫోసిస్‌ నష్టపోతున్నాయి.  అటు  సిమెంట్‌ షేర్లలో కొనుగోళ్లధోరణి కనిపిస్తోంది

మరోవైపు  ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా  ఈ రోజు కరెన్సీ మార్కెట్లకు  సెలవు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top