లాభాల్లో స్టాక్మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయస్టాక్మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 77 పాయింట్ల లాభంతో 33,665 వద్ద, నిప్టీ 22 పాయింట్ల లాభంతో 10,371 వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తున్నాయి. తద్వారా నిఫ్టీ కొత్త గరిష్టం 10,400 దిశగా పయనిస్తోంది. బ్యాంక్ నిప్టీ కూడా అదే బాటలో సరికొత్త గరిష్టం వైపు దూసుకుపోతోంది. దాదాపు అన్ని రంగాలూ లాభాలనార్జిస్తున్నాయి. బ్యాంకింగ్, ఆటో సెక్టార్ లాభపడుతుండగా, మెటల్ నష్టపోతోంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్ గెయినర్గా ఉంది. ఎస్బీఐ, ఐసీఐసీఐ, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ లాభపడుతున్నాయి. హిందుస్తాన్ జింక్, వేదాంతా, జీ, సన్ టీవీ నష్టపోతున్నాయి.
సంబంధిత వార్తలు