సెంచరీ లాభాలతో షురూ : రిలయన్స్ జంప్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో కీలక సూచీల్లో కొనుగోళ్ల ధోరణి కనిపిస్తోంది. దీంతో సెన్సెక్స్ 82 పాయింట్ల లాభంతో 35,629 వద్ద, నిఫ్టీ 24 పాయింట్లు పుంజకుని 10795 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాలు లాభపడుతున్నాయి. ఏవియేషన్ షేర్లు, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ బ్యాంకింగ్ షేర్లలో లాభాలను సాధిస్తున్నాయి. ఫార్మా నష్టపోతోంది.
ముఖ్యంగా రిలయన్స్, అదానీ పోర్ట్స్, జీ, టెక్మహీంద్రా , ఎల్ అండ్ టీ, హెచ్పీసీఎల్, ఐసీఐసీఐ టాప్ విన్నర్స్గా ఉన్నాయి. అశోక్ లేలాండ్, ఆయిల్ ఇండియా షేర్లు కూడా లాభాల్లోనే. అయితే భారతి ఎయిర్టెల్, రిలయన్స్ ఇన్ఫ్రా, గెయిల్, పవర్ గ్రిడ్, మారికో, డా.రెడ్డీస్, దివీస్ నష్టపోతున్నాయి.