లాభాల శుభారంభం, ఫార్మా జూమ్
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల్లోప్రారంభమైనాయి. ఆరంభ లాభాల నుంచి మరింత ఎగిసిన సెన్సెక్స్ 230 పాయింట్ల లాభంతో 37580 వద్ద, నిఫ్టీ 66 పాయింట్లు ఎగిసి 11113 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని సెక్టార్లు లాభాల్లోట్రేడ్ అవుతున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఫార్మ లాభపడుతున్నాయి. ఎల్అండ్టీ, టీసీఎస్, విప్రో, కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ, ఎం అండ్ అండ్, సన్ఫార్మా, డా, రెడ్డీస్, లుపిన్, సిప్లా లాభపడుతున్నాయి. మరోవైపు పవర్ గ్రిడ్, బ్రిటానియా, టాటా మోటార్స్, మారుతి సుజుకి, ఆసియన్ పెయింట్స్, యూపీఎల్ నష్టపోతున్నాయి.
మరిన్ని వార్తలు