లాభాల్లో స్టాక్మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు పాజిటివ్గా మొదలయ్యాయి. అంతర్జాతీయంగా సానుకూలం వాతావరణంతో దేశీయ సూచీలు కూడా స్థిరంగా ట్రేడింగ్ను ప్రారంభించాయి. సెన్సెక్స్ 152 పాయింట్ల లాభంతో 34,594 వద్ద, నిఫ్టీ 25 పాయింట్లు ఎగిసి 10,411వద్ద కొనసాగుతున్నాయి. టాటా మోటార్స్, ఎస్బ్యాంకు , ఎల్ అండ్టీ, యాక్సిస్, ఐటీసీ లాభపడుతున్నాయి. మరోవైపు ఎస్బీఐ, ఐసీఐసీఐ, టెక్మహీంద్ర, పిరామల్ ఎంటర్ప్రైజెస్, కోల్ ఇండియా నష్టపోతున్నవాటిల్లోఉన్నాయి.