డబుల్‌ సెంచరీ లాభాలు...రికార్డుల మోత

Stockmarkets Opens with  All Time High - Sakshi

సాక్షి, ముంబై:  సోమవారం  ఎగ్జిట్‌ పోల్స్‌ జోష్‌తో భారీ లాభాలతో రికార్డుల  మోత మోగించిన కీలక  సూచీలు మంగళవారం  రికార్డుల పరంపర కొనసాగింది.  సెన్సెక్స్‌, నిఫ్టీ కొత్త గరిష్టాలను తాకాయి.  నిఫ్టీ బ్యాంకు కూడా సరికొత్త  గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 203 పాయింట్లు ఎగిసి 39, 554 వద్ద, నిఫ్టీ 53 పాయింట్లు ఎగిసి 11868 వద్ద కొనసాగుతోంది.   దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే ఉన్నాయి.  హెచ్‌డీఎఫ్‌సీ, డీఆర్‌ఎల్‌, అదానీ, ఇండియాబుల్స్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ టాప్‌ గెయినర్స్గా ఉన్నాయి.   టాటా మోటార్స్‌, బీపీసీఎల్‌​, గ్రాసిం, ఎస్‌ బ్యాంకు,  టాటా స్టీల్‌ నష్టపోతున్నాయి. 

అటు డాలరు మారకంలో రుపీ కూడా పాజిటివ్‌గా ఉంది.  మంగళవారం 69.74 వద్ద  ట్రేడింగ్‌ను ఆరంభించింది.  సోమవారం 69.73 వద్ద ముగిసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top