లాభాల్లో ముగిసిన మార్కెట్లు

stockmarkets  ends with gains - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు   లాభాలతో ముగిశాయి. లాభనష్టాల మధ్య ఊగిస లాడిన మార్కెట్లు చివరికి వారాంతంలో పాజిటివ్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 64  పాయింట్లు  లాభపడి 33,315 వద్ద, నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో  10,321 వద్ద  స్థిరపడ్డాయి. ముఖ‍్యంగా  ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌ సాధించిన ప్రోత్సాహకర ఫలితాల కారణంగా పీఎస్‌యూ బ్యాంక్స్‌  లాభాల పట్టాయి.  ఫార్మా, ఆటో, ఐటీ రంగాలు నష్టపోయాయి.
 ఎస్‌బీఐ , ఎల్‌ అండ్‌టీ,   సెయిల్‌, ఎంఆర్‌ఎఫ్‌ టాప్‌ విన్నర్స్‌గా నిలవగా   పీఎఫ్‌సీ, ఆర్‌కాం,  అశోక్‌ లేలాండ్‌, యునైటెడ్‌ స్పిరిట్స్‌ టాప్‌ లూజర్స్‌ గా ఉన్నాయి.  ఐడీబీఐ, సిండికేట్‌, అలహాబాద్‌, ఓబీసీ, ఇండియన్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌  లాభాల్లోనూ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఆర్‌ఐఎల్‌, సన్‌ ఫార్మా, యూపీఎల్‌, కొటక్‌ బ్యాంక్‌  నష్టాల్లోను ముగిశాయి.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top