వారమంతా లాభాలే.. 

Stockmarkets ends with gains - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.  ఇన్వెస్టర్ల కొనుగోళ్లకు కట్టుబడటంతో మార్కెట్లు ఆద్యంతమూ పటిష్టంగా కదిలాయి. సెన్సెక్స్‌ 92 పాయింట్లు ఎగిసి 34,192వద్ద, నిఫ్టీ 22పాయింట్ల లాభంతో 10,480 వద్ద స్థిరపడ్డాయి. ఇంట్రాడేలో మరోవైపు నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 10,500 మార్క్‌ను టచ్‌ చేసింది.  అంతేకాదు ఈ వారమంతా లాభాల్లోనే  కొనసాగిన మార్కెట్లు వారాంతంలో  మరింత పటిష్టంగా ముగియడం సానుకూల అంశం.  మెటల్‌, ఐటీ, ఫార్మా, రియల్టీ  పాజిటివ్‌గానూ,  పీఎస్‌యూ బ్యాంక్స్‌ వీక్‌ బలహీనంగానూ ముగిశాయి.  అదానీ పోర్ట్స్‌, టెక్‌ మహీంద్రా, ఐషర్‌, హిందాల్కో, ఐబీ హౌసింగ్‌, విప్రో, డాక్టర్‌ రెడ్డీస్‌,  కొటక్‌ బ్యాంక్‌, ఆర్‌ఐఎల్‌, కొటక్‌ బ్యాంక్‌  లాభపడగా,  బీపీసీఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐవోసీ, ఎస్‌బీఐ, యాక్సిస్‌, హెచ్‌పీసీఎల్‌, మారుతీ, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌ నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top