లాభాల ముగింపు: మెటల్‌, బ్యాంకింగ్‌ అప్‌

stockmarkets ends with gains - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఆరంభంనుంచి  లాభాలతోనే కదలాడిన మార్కెట్లు  ఆరంభ లాభాలను కోల్పోయినప్పటికీ చివరికి పాజిటివ్‌గానే ముగిశాయి.  సెన్సెక్స్‌ 92 పాయింట్లు లాభంతో 33,880 వద్ద, నిఫ్టీ 23 పాయింట్లు లాభంతో 10,402 వద్ద స్థిరంగా ముగిశాయి. బ్యాంకింగ్‌, మెటల్‌​ సెక్టార్లు లాభాల్లో ముగిశాయి.  యాక్సిస్‌, ఎస్‌బ్యాంకు, హిందాల్కో, టాటా స్టీల్‌,  లాభపడగా, వీటితో పాటు ఐసీఐసీఐ, ఫెడరల్‌బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, కోల్‌ ఇండియా,  టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా కూడా లాభపడ్డాయి. మరోవైపు బజాన్‌ ఫిన్‌​ సర్వ్‌, డా.రెడ్డీస్‌ , ఆక్‌ కాం నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top