లాభాల ముగింపు: మెటల్, బ్యాంకింగ్ అప్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఆరంభంనుంచి లాభాలతోనే కదలాడిన మార్కెట్లు ఆరంభ లాభాలను కోల్పోయినప్పటికీ చివరికి పాజిటివ్గానే ముగిశాయి. సెన్సెక్స్ 92 పాయింట్లు లాభంతో 33,880 వద్ద, నిఫ్టీ 23 పాయింట్లు లాభంతో 10,402 వద్ద స్థిరంగా ముగిశాయి. బ్యాంకింగ్, మెటల్ సెక్టార్లు లాభాల్లో ముగిశాయి. యాక్సిస్, ఎస్బ్యాంకు, హిందాల్కో, టాటా స్టీల్, లాభపడగా, వీటితో పాటు ఐసీఐసీఐ, ఫెడరల్బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, కోల్ ఇండియా, టాటా స్టీల్, టెక్ మహీంద్రా కూడా లాభపడ్డాయి. మరోవైపు బజాన్ ఫిన్ సర్వ్, డా.రెడ్డీస్ , ఆక్ కాం నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి.
మరిన్ని వార్తలు