చివరికి లాభాలు : వారాంతంలో ఒకే
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు చివరికి లాభాల్లోనే ముగిశాయి. ఆరంభంలో డబుల్సెంచరీ లాభాలనుసాధించిన సెన్సెక్స్ అనంతరం ఒడిదుడుకులకు లోనైయంది. చివరికి 178 పాయింట్ల లాభంతో 38,862 వద్ద, నిఫ్టీ 68 పాయింట్లు బలపడి 11,666 వద్ద ముగిసింది. వర్షపాత అంచనాలు, ఆర్బీఐ పాలసీ నిర్ణయాల నేపథ్యంలో గత రెండు రోజులుగా అమ్మకాలతో బలహీనపడిన దేశీయ సూచీలు ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాల నేపథ్యంలో తొలుత మార్కెట్లు ప్రోత్సాహకరంగా ప్రారంభమయ్యాయి. అనంతరం హెచ్చుతగ్గుల మధ్య కొనసాగుతూ వారాంతంలో పాజిటివ్ సంకేతాలనిచ్చింది.
మెటల్స్, రియల్టీ, ఐటీ, ప్రయివేట్ బ్యాంక్స్ పుంజుకున్నాయి. అయితే పీఎస్యూ బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ క్షీణించాయి. టాటా స్టీల్, అల్ట్రాటెక్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, వేదాంతా, ఐషర్, ఐవోసీ, సిప్లా, గ్రాసిమ్ 4-2 శాతం మధ్య ఎగశాయి. అయితే పవర్గ్రిడ్, బ్రిటానియా, జీ, ఎస్బీఐ, డాక్టర్ రెడ్డీస్, ఎన్టీపీసీ, హీరో మోటో, యస్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, సన్ ఫార్మానష్టపోయినవాటిల్లో ఉన్నాయి.