భారీ నష్టాల్లో స్టాక్మార్కెట్లు
సాక్షి,ముంబై: దేశీ స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతునన్నాయి. ట్రేడ్వార్ భయాలు ప్రపంచ స్టాక్ మార్కెట్లను దెబ్బతీయడంతో దేశీయంగానూ అదే ప్రభావం కనిపిస్తోంది. తీవ్ర అమ్మకాలతో స్నెన్సెక్స్ 270 పాయింట్లు పైగా పతనమై 35వేల దిగువకు చేరింది. ప్రస్తుతం సెన్సెక్స్ 188 పాయింట్లు క్షీణించి 35,028 వద్ద, నిఫ్టీ 83 పాయింట్లు నష్టపోయి 10,588 వద్ద కొనసాగుతుతోంది. ఒక్కమెటల్ తప్ప దాదాపు అన్ని రంగాలూ బలహీనంగా ఉన్నాయి. ప్రధానంగా రియల్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫార్మా, ఆయిల్ నష్టాలు మార్కెట్లను లీడ్ చేస్తున్నాయి. బీపీసీఎల్, హెచ్పీసీఎల్, పీఎన్బీ, టెక్ మహీంద్ర, అశోక్ లేలాండ్, ప్రెస్టేజ్, ఇండియా బుల్స్, డీఎల్ఎఫ్, శోభా, ఒబెరాయ్, హెచ్డీఐఎల్, బ్రిగేడ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, యూనిటెక్, పీనిక్స్, శ్రీరామ్ ట్రాన్స్, చోళమండలం, ఎంఆర్పీఎల్, జైన్ ఇరిగేషన్, జెట్ ఎయిర్వేస్, టెక్ మహీంద్రా, టీవీ18, టైటన్, ఎన్సీసీ, బాలకృష్ణ ఇండస్ట్రీస్ నష్ట పోతున్నాయి. అటు మదర్సన్ సుమీ, టాటా స్టీల్ , ఎం అండ్ ఎం, గోద్రెజ్, నాల్కో, హిందాల్కో, భారత్ ఫోర్జ్, కంకార్, టొరంట్ పవర్, ఇన్ఫోసిస్, గోద్రెజ్ సీపీ, టాటా పవర్ టాప్విన్నర్స్గా ఉన్నాయి.