భారీ లాభాలు : సరికొత్త శిఖరానికి చేరువలో

Stockmarkets  All Time New High  - Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. సాధారణ వర్షపాత అంచనాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ పాజిటివ్‌గా ఉంది.  అనంతరం మరింత పుంజుకుని డబుల్‌ సెంచరీ లాభాలను సాధించింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 201 పాయింట్లు  లాభంతో 39110  వద్ద, నిఫ్టీ 55 పాయింట్లు  ఎగిసి వద్ద 11743 ట్రేడ్‌ అవుతున్నాయి.  సరికొత్త తీరాలకు  సమీపానికి సూచీలు చేరాయి. దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే ఉన్నాయి.  ప్రధానం బ్యాంక్‌ నిఫ్టీ బాగా లాభపడుతోంది.  బ్యాంకింగ్‌ సెక్టార్లో నెలకొన్న కొనుగోళ‍్లతో బ్యాంక్‌ నిఫ్టీ  30600 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. 

మారుతి, హీరో మోటో, ఐసీఐసీఐ, వేదాంతా, భారతి ఇన్‌ఫ్రాటెల్‌, జీ,  ఇండస్‌ ఇండ్‌, స్పైస్‌ జెట్‌  లాభపడుతున్నాయి.  మరోవైపు అదానీ, జెట్‌ ఎయిర్‌వేస్‌​ నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి బలహీనంగా ప్రారంభమైంది.  69.49 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top