లాభాల్లో స్టాక్మార్కెట్లు
సాక్షి, ముంబై: స్టాక్మార్కెట్లు పాజిటివ్గా ప్రారంభమైనాయి. సెన్సెక్స్+73, నిఫ్టీ +18తో ట్రేడ్ అవుతున్నాయి. రియల్టీ మెటల్ షేర్లు మార్కెట్లను లీడ్ చేస్తుండగా ఆటో, ఫార్మా, టెలికాం , సిమెంట్ , బ్యాంకింగ్ షేర్లు కూడా పాజిటివ్గా ఉన్నాయి. ముఖ్యంగా టొరంటో పవర్ ఆర్ఐల్, టాటా స్టీల్, హిందుస్తాన్ యూనీ లీవర్, ఎస్బ్యాంక్ లాభ పడుతున్నాయి. అటు హావెల్స్, భారతి ఎయిర్టెల్, డిష్ టీవీ, ఐవీఆర్ సీఎల్ నష్టపోతున్నాయి.
మరోవైపు దేశీయ రెంcడవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ నేడు ఫలితాలను ప్రకటించనుంది. నందన్ నీలేకని సారధ్యంలో ఇన్ఫీ పెర్ఫామెన్స్ , గైడెన్స్ అంచనాలు కీలకంగా మారనున్నాయి. దీంతో పాటు సీఈవో ప్రకటనపై కూడా మార్కెట్ ఎదురు చూస్తోంది.